Chiranjeevi: సూర్యాపేటలో రోడ్డు ప్రమాదం.. మెగాస్టార్ చిరంజీవి బాల్య స్నేహితుడు దుర్మరణం

  • చికిత్స కోసం కారులో హైదరాబాద్‌‌కు బయలుదేరిన కుటుంబం
  • రోడ్డు ప్రమాదంలో దంపతులు, వారి కుమారుడు దుర్మరణం
  • చిరంజీవితో కలిసి చదువుకున్న సత్యానందం
megastar chiranjeevi childhood friend satyanandam died in road accident

సూర్యాపేటలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మెగాస్టార్ చిరంజీవి క్లాస్‌మేట్ కుటుంబం దుర్మరణం పాలైంది. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలంలోని ఆగర్తిపాలేనికి చెందిన మైలాబత్తుల సత్యానందం అధ్యాపకుడు. చిరంజీవి, సత్యానందం ఇద్దరూ బాల్య స్నేహితులు. నరసాపురం వైఎన్‌ కళాశాలలో ఇద్దరూ డిగ్రీ కలిసి చదువుకున్నారు. ఆ తర్వాత చిరంజీవి సినిమాల్లోకి రాగా, సత్యానందం అధ్యాపకుడిగా స్థిరపడ్డారు. రాజమండ్రి డిగ్రీ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు. ఆయన భార్య విజయకుమారి కూడా ఉపాధ్యాయురాలిగా పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు. వీరికి కుమారుడు జోసఫ్, కుమార్తె ఉన్నారు.

విజయకుమారి అనారోగ్యంతో బాధపడుతుండడంతో చికిత్స కోసం సత్యానందం, జోసెఫ్‌తో కలిసి కారులో నిన్న తెల్లవారుజామున  విజయవాడ నుంచి హైదరాబాద్ బయలుదేరారు. మార్గమధ్యంలో సూర్యాపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో వీరు ముగ్గురూ దుర్మరణం పాలయ్యారు.

More Telugu News