తెలంగాణ, ఏపీల మధ్య బస్సులు ఇప్పట్లో లేనట్టే!
- నేడు జరగాల్సిన ఉన్నతాధికారుల సమావేశం వాయిదా
- అనివార్య కారణాలతో వాయిదా వేస్తున్నట్టు వెల్లడి
- కరోనా కేసులు పెరగవచ్చన్న ఆలోచనతోనే వాయిదా
కాగా, అనివార్య కారణాల వల్ల ఈ సమావేశాన్ని వాయిదా వేస్తున్నామని అధికారులు ప్రకటించారు. రెండు రాష్ట్రాల మధ్యా బస్సులను నడిపించే విషయమై గతంలోనే ఓ సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీలు తమతమ రాష్ట్రాల పరిధిలో మాత్రమే బస్సులు నడుపుతున్నాయి. తాజా సమావేశం వాయిదా పడటంతో బస్సు సర్వీసులు ప్రారంభం అవుతాయని ఎదురుచూసిన తెలుగు ప్రజలకు నిరాశే మిగిలింది.