భారత్-చైనా సరిహద్దుల్లో కుప్పకూలిన కీలక వంతెన... వీడియో ఇదిగో!
- 15 గ్రామాల రాకపోకలకు ఉపయోగపడుతున్న వంతెన
- భారత సైన్యం, ఐటీబీపీ బలగాలు దీని ద్వారానే రాకపోకలు
- పునరుద్ధరణకు మరో రెండు వారాల సమయం
వ్యూహాత్మకంగా కూడా ఈ వంతెనకు ఎంతో ప్రాధాన్యత ఉంది. భారత సైన్యం, ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ బలగాలు ఈ వంతెన ద్వారానే సరిహద్దు ప్రాంతాలకు వెళుతుంటాయి. 40 అడుగుల పొడవైన ఈ వంతెనను 2009లో నిర్మించారు. భారత్-చైనా మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలో ఈ వంతెన కూలిపోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. కూలిన వంతెన పునరుద్ధరించేందుకు మరో రెండు వారాల సమయం పడుతుందని భావిస్తున్నారు.