Nayeem: కీలక మలుపు తిరగనున్న నయీం కేసు!

  • నయీంతో పోలీసు, రెవెన్యూ అధికారుల ఫొటోలు
  • ఆర్టీఐ చట్టం కింద సమాచారాన్ని సేకరించిన ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్
  • ఆధారాలను లోక్ పాల్ కు సమర్పించనున్న ఫోరం
Twist in Gangster Nayeem case

గ్యాంగ్ స్టర్ నయీం కేసు తెలంగాణలో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఎన్ కౌంటర్ లో నయీం హతమై చాలా కాలమవుతున్నప్పటికీ... ఎప్పటికప్పుడు ఈ కేసులో ఏదో ఒక కొత్త విషయం తెరపైకి వస్తూనే ఉంది. తాజాగా నయీంతో పోలీస్, రెవెన్యూ అధికారులు దిగిన ఫోటోలను లోక్ పాల్ కు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సమర్పించనుంది. ఆర్టీఐ చట్టం కింద ఈ సమాచారాన్ని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సేకరించింది. నయీంతో కలిసి అధికారులు అక్రమాలకు పాల్పడ్డారని, వారి పాత్రపై విచారణ జరపాలని లోక్ పాల్ ను కోరనుంది. ఈ నేపథ్యంలో నయీం కేసులో పలువురి జాతకాలు బయటపడే అవకాశం ఉందని భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News