హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌గా భానుమతి.. తొలి మహిళగా రికార్డు

BS Bhanumathi appinted as AP High Court registrar
  • హైకోర్టు విభజన తర్వాత తొలి రిజిస్ట్రార్‌గా పనిచేసిన మానవేంద్రనాథ్
  • ప్రస్తుతం విశాఖ ప్రిన్సిపల్ జిల్లా, సెషన్స్ జడ్జిగా పనిచేస్తున్న భానుమతి
  • 30లోపు బాధ్యతల స్వీకరణ
విశాఖపట్టణం ప్రిన్సిపల్ జిల్లా, సెషన్స్ జడ్జి బీఎస్ భానుమతి ఏపీ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ (ఆర్‌జీ)గా నియమితులై రికార్డులకెక్కారు. ఈ నెల 30లోపు ఆమె బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆర్‌జీగా ఓ మహిళ ఎన్నిక కావడం ఇదే తొలిసారి. హైకోర్టు విభజన తర్వాత చీకటి మానవేంద్రనాథ్ హైకోర్టు తొలి రిజిస్ట్రార్ జనరల్‌గా పనిచేశారు.

అయితే, ఆరు నెలల తర్వాత ఆయన హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులవడంతో అప్పటి నుంచి ఆ పోస్టు ఖాళీగా ఉంది. ఐటీ కమ్ సెంట్రల్ ప్రాజెక్టు కో ఆర్డినేటర్ రిజిస్ట్రార్ అయిన బి.రాజశేఖర్ ఇప్పటి వరకు రిజిస్ట్రార్ బాధ్యతలను నిర్వర్తిస్తూ వచ్చారు. ఇప్పుడా స్థానంలో బీఎస్ భానుమతిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. 
Go Back to Shorts
AP High Court
BS Bhanumathi
High court registrar

More Telugu News