మా కమాండింగ్ ఆఫీసర్ కూడా చనిపోయాడు: వారం తర్వాత ఒప్పుకున్న చైనా
- రెండు దేశాల మధ్య ఘర్షణలో 20 మంది భారత సైనికుల వీర మరణం
- చైనా వైపు కూడా పెద్ద సంఖ్యలో మరణాలు
- మరణాల సంఖ్యను దాస్తున్న చైనా
అయితే, ఈ ఘర్షణ జరిగిన వారం తర్వాత చైనా ఎట్టకేలకు దీనిపై స్పందించింది. ఘర్షణలో తమ కమాండింగ్ ఆఫీసర్ కూడా చనిపోయారని వెల్లడించింది. ఇరు దేశాల మధ్య గత వారం జరిగిన మిలిటరీ అధికారుల స్థాయి చర్చల్లో చైనా అధికారులు ఈ విషయాన్ని ఒప్పుకున్నట్టు ఆర్మీ ఉన్నత వర్గాలు తెలిపాయి. అయితే, మొత్తం ఎంత మంది చైనా సైనికులు ప్రాణాలు కోల్పోయారనే విషయాన్ని మాత్రం చైనా ప్రకటించలేదు.