చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతిలకు ఏపీ ప్రభుత్వం లీగల్ నోటీసులు జారీ
- 15 రోజుల్లో క్షమాపణలు చెప్పాల్సిందే
- లేదంటే చట్టపరమైన చర్యలు తప్పవు
- లీగల్ నోటీసులు పంపిన ప్రభుత్వం
15 రోజుల్లోగా బేషరతుగా క్షమాపణలు చెప్పాలని, లేదంటే చట్టపరంగా ప్రభుత్వం సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటుందంటూ చంద్రబాబుతోపాటు ఆ రెండు సంస్థలకు లీగల్ నోటీసులు జారీ చేసినట్టు చెప్పారు.
అలాగే, నాణ్యమైన బియ్యం పంపిణీ కోసం ఉద్దేశించిన సంచులను ప్రభుత్వం టెండర్లు పిలవకుండానే సీఎం వైఎస్ జగన్కు సంబంధించిన సంస్థ నుంచి కొనుగోలు చేసిందంటూ ఆరోపణలు చేసిన చంద్రబాబు, ఆ వార్తను ప్రచురించిన ఈనాడు పత్రిక ఫౌండర్ డైరెక్టర్ రామోజీరావు, ఎడిటర్ ఎం.నాగేశ్వరరావులకు ప్రభుత్వం లీగల్ నోటీసులు జారీ చేసింది. ఇవి అందిన ఏడు రోజుల్లోనే క్షమాపణలు చెప్పకుంటే పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించింది.