క్యాన్సర్ రోగుల సేవలో 20 ఏళ్లు... ఫౌండేషన్ లోగో విడుదల చేసిన బాలకృష్ణ
- 2000 సంవత్సరంలో ప్రారంభమైన క్యాన్సర్ ఫౌండేషన్
- ప్రారంభించిన అప్పటి ప్రధాని వాజ్ పేయి
- లోగో విడుదల కార్యక్రమంలో పాల్గొన్న బాలయ్య అల్లుడు శ్రీభరత్
ఈ కార్యక్రమంలో బాలకృష్ణతో పాటు ట్రస్ట్ సభ్యుల్లో ఒకరైన ఆయన అల్లుడు శ్రీభరత్, మరో సభ్యుడు జేఎస్సార్ ప్రసాద్ పాల్గొన్నారు. ఈ వివరాలను బాలయ్య తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా వెల్లడించారు. ఈ ఫౌండేషన్ ను 2000 సంవత్సరంలో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ప్రధాని వాజ్ పేయి చేతులమీదుగా ప్రారంభించారని వివరించారు. క్యాన్సర్ చికిత్సలో ఇన్నేళ్ల ప్రస్థానం నిస్సందేహంగా ఓ మైలురాయి అని పేర్కొన్నారు.