టీషర్టు ధరించి, మంచంపై పడుకుని వాదనలు వినిపించిన న్యాయవాది.. సీరియస్ అయిన న్యాయమూర్తి!
- కరోనా నేపథ్యంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు విచారణలు
- న్యాయవాది తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన జడ్జి
- వెంటనే క్షమాపణలు కోరిన లాయర్
జూన్ 15న పిటిషన్ వేసే క్రమంలో ఆ న్యాయవాది తన నివాసంలో టీషర్టు ధరించి, మంచంపై హాయిగా పడుకుని న్యాయమూర్తితో మాట్లాడడం ప్రారంభించాడు. దాంతో ఆగ్రహించిన న్యాయమూర్తి ఆ లాయర్ ను తీవ్రంగా మందలించారు. దాంతో తన తప్పు తెలుసుకున్న ఆ న్యాయవాది వెంటనే క్షమాపణలు కోరడంతో న్యాయమూర్తి శాంతించారు. దీనిపై న్యాయమూర్తి మాట్లాడుతూ, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణల్లోనూ న్యాయవాదులు నిబంధనలు పాటించాలని, కోర్టు గౌరవ మర్యాదలు కాపాడేలా వ్యవహరించాలని హితవు పలికారు.