ఆఫ్టరాల్ మీది ప్రతిపక్షం, మీకిచ్చింది 23 సీట్లు!: టీడీపీపై నిప్పులు చెరిగిన వాసిరెడ్డి పద్మ
- అయ్యన్న ఉదంతాన్ని మహిళా కమిషన్ సుమోటోగా తీసుకుంటుందని వెల్లడి
- అయ్యన్నపాత్రుడ్ని అరెస్ట్ చేయిస్తామంటూ వ్యాఖ్యలు
- రాజకీయ రంగు పులుముతున్నారంటూ ఆగ్రహం
"ఇలాంటి ఘటనలకు రాజకీయ రంగు పులుముతున్నారు. మున్సిపల్ కమిషనర్లు, ఇతర చిన్న ఉద్యోగాలు చేసుకునే ఆడవాళ్లకు ఏమీ సత్తా లేదనుకుంటున్నారా? మీ రాజకీయ క్రీడలకు వీళ్లు బలవ్వాలా? అయ్యన్నపాత్రుడ్ని ఒక్కమాట అంటే ఇదే చంద్రబాబు, లోకేశ్ ఊరుకుంటారా? మహిళా అధికారులు ఇలాంటి వాళ్ల ముందు ఎందుకు తలదించాలి? ఇలాంటి మాటలు ఎందుకు భరించాలి? ఆఫ్టరాల్ మీది ప్రతిపక్షం, ప్రజలు మీకిచ్చింది 23 స్థానాలు. ఇంత తక్కువ ప్రజాదరణ ఉన్నప్పుడే మీరు ఇంత అహంకారం ప్రదర్శిస్తే చూస్తూ ఊరుకోం. ఈ ఘటనను రాజకీయం చేసి తప్పించుకోవాలని చూస్తే వదిలిపెట్టేది లేదు. మహిళా కమిషన్ చర్యలు తీసుకుంటుంది. ఈ ఘటనను ఏపీ మహిళా కమిషన్ సుమోటోగా తీసుకుంటుంది. అయ్యన్నను అరెస్ట్ చేయిస్తాం" అంటూ స్పష్టం చేశారు.