Kanna Lakshminarayana: దీనిపై దేశ ప్రజలంతా ప్రమాణం చేయాలి: చైనాతో ఉద్రిక్తతలపై కన్నా లక్ష్మీనారాయణ

  • చైనా వస్తువులు కొనుగోలు చేయొద్దు  
  • చైనాను ఆర్థికంగా దెబ్బకొట్టాలి
  • అప్పుడే ఆ దేశానికి బుద్ధి వస్తుంది
  • ఏడాది కాలంగా చైనా కవ్వింపు చర్యలు
kanna laxminarayana on china india face off

తూర్పు లడఖ్‌లో భారత్‌-చైనా మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఈ విషయంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ స్పందిస్తూ డ్రాగన్‌ దేశంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చైనా వస్తువులు కొనుగోలు చేయొద్దని, దీనిపై దేశ ప్రజలంతా ప్రమాణం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. చైనాను ఆర్థికంగా దెబ్బకొట్టాలని, అప్పుడే ఆ దేశానికి బుద్ధి వస్తుందని తెలిపారు.
 
చైనా దాడిలో అమరులైన సైనికులకు బీజేపీ ఏపీ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ నేతలు నివాళులు అర్పించారు. అనంతరం కన్నా లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. ఏడాది కాలంగా చైనా కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉందని చెప్పారు. చైనా సైనికులతో భారత సైనికులు పోరాడిన తీరును కన్నా లక్ష్మీనారాయణ   కొనియాడారు. ఈ పోరులో 20 మంది భారత సైనికులు అమరులయ్యారని, వారి ఆత్మకు శాంతి చేకూరాలని దేశం మొత్తం కోరుకుంటుందని తెలిపారు.

More Telugu News