Col Santosh Babu: కల్నల్ సంతోష్ బాబు పార్థివదేహం సూర్యాపేట తరలింపు

  • హకీంపేటలో సైనిక వందనం
  • కల్నల్ సంతోష్ పార్థివదేహానికి నివాళులు అర్పించిన గవర్నర్
  • రేపు ఉదయం 8 గంటలకు కేసారంలో అంత్యక్రియలు
  • అంతిమయాత్రకు ప్రత్యేక వాహనం సిద్ధం చేసిన అధికారులు
Army officials moves Col Santosh mortal remains to Suryapet

లడఖ్ వద్ద చైనా బలగాలతో ఘర్షణలో మృతిచెందిన తెలుగు కల్నల్ సంతోష్ బాబు పార్థివదేహాన్ని సూర్యాపేట తీసుకువస్తున్నారు. హైదరాబాదు హకీంపేట విమానాశ్రయం నుంచి కల్నల్ సంతోష్ బాబు పార్థివదేహాన్ని స్వస్థలానికి తరలిస్తున్నారు. అంతకుముందు హకీంపేట విమానాశ్రయంలో కల్నల్ సంతోష్ బాబు పార్థివదేహానికి సైనిక వందనం నిర్వహించారు. ఈ అమరవీరుడికి తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, పలువురు మంత్రులు నివాళి అర్పించారు. కాగా, రేపు సూర్యాపేట నుంచి కేసారం వరకు అంతిమయాత్ర చేపట్టనున్నారు. అంతిమయాత్ర కోసం అధికారులు ప్రత్యేక వాహనం సిద్ధం చేశారు. రేపు ఉదయం 8 గంటలకు కేసారంలో కల్నల్ సంతోష్ బాబు అంత్యక్రియలు సైనిక లాంఛనాలతో జరగనున్నాయి.

More Telugu News