కృష్ణా జిల్లా రోడ్డు ప్రమాదంలో తెలంగాణ వాసులు మృతి చెందడం పట్ల సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి
- వేదాద్రి వద్ద రోడ్డు ప్రమాదం
- ట్రాక్టర్ ను ఢీకొన్న లారీ
- 10 మంది దుర్మరణం
మృతులంతా ఖమ్మం జిల్లా మధిర ప్రాంతానికి చెందినవారు. వారి స్వస్థలం ఎర్రుపాలెం మండలం గోపవరం. వేదాద్రి లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి వెళ్లి వస్తుండగా ఈ ఘటన జరిగింది. ఓ సిమెంట్ లారీ వీరు ప్రయాణిస్తున్న ట్రాక్టర్ ను బలంగా ఢీకొట్టింది. దాంతో ట్రాక్టర్ బోల్తా పడింది.