కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం... 10 మంది దుర్మరణం

Road accident in Krishna district killed six people
  • కృష్ణా జిల్లాలో నెత్తురోడిన రహదారి
  • వేదాద్రి వద్ద ట్రాక్టర్, లారీ ఢీ
  • మృతులు ఖమ్మం జిల్లా మధిర వాసులు
కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. జగ్గయ్యపేట మండలం వేదాద్రి వద్ద ట్రాక్టర్, లారీ ఢీకొని 10 మంది మృతి చెందారు. ప్రమాద సమయంలో ట్రాక్టర్ లో 30 మందికి పైగా ఉన్నట్టు తెలుస్తోంది. 14 మంది గాయాల పాలవగా వారిని జగ్గయ్యపేట ఆసుపత్రికి తరలించారు. ఆపై వారిని ఖమ్మం తరలించారు. మృతులను ఖమ్మం జిల్లా మధిర వాసులుగా గుర్తించారు. ఘటన జరిగిన వెంటనే పోలీసులు, ఇతర అధికారులు అక్కడికి చేరుకుని సహాయచర్యలకు ఉపక్రమించారు.
Go Back to Shorts
Road Accident
Krishna District
Tractor
Lorry
Vedadri
Andhra Pradesh

More Telugu News