ఇది సమంజసం కాదు.. ఇది ఉల్లంఘనే!: నేపాల్ కొత్త మ్యాప్ పై భారత్
- భారత్ లోని కొన్ని ప్రాంతాలను తనవిగా పేర్కొంటున్న నేపాల్
- కొత్త ప్రాంతాలను కలుపుకుని సరికొత్త మ్యాప్ కు రూపకల్పన
- నేపాల్ పార్లమెంటులోని ప్రతినిధుల సభలో మ్యాప్ కు ఆమోదం
భారత్ ప్రాదేశిక భూభాగంలోని కొన్ని ప్రాంతాలను తనవిగా చూపించుకుంటూ రూపొందించిన మ్యాప్ కు రాజ్యాంగబద్ధత కల్పించే బిల్లుకు నేపాల్ చట్టసభలో ఆమోదం లభించిన విషయం తమకు తెలిసిందని, ఈ విషయంలో తమ వైఖరి ఇప్పటికే నేపాల్ కు తెలియజేశామని వెల్లడించారు.
గత నెలలో 8వ తేదీన రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ భారత్-నేపాల్ సరిహద్దుల్లో లిపులేఖ్ ప్రాంతాన్ని దర్చూలా ప్రాంతంతో కలిపే 80 కిలోమీటర్ల రోడ్ కు ప్రారంభోత్సవం చేశారు. ఈ చర్య నేపాల్ ను అసంతృప్తి గురిచేయగా, అప్పటి నుంచే మ్యాప్ సవరణలు చేస్తూ తన అసహనాన్ని వెళ్లగక్కుతోంది.