భారత్ దాడి చేస్తోందంటూ పాకిస్థాన్ లో ప్రచారం.. వణికిపోయిన ప్రజలు!
- సోషల్ మీడియాలో నిన్న అర్ధరాత్రి పుకార్లు
- కరాచీకి దగ్గరగా యుద్ధ విమానాలు వచ్చాయంటూ వార్తలు
- బాలాకోట్ తరహా దాడి జరగబోతోందని ప్రచారం
కరాచీకి దగ్గరగా చాలా విమానాలు వచ్చాయని... విమానాశ్రయం వద్ద తాను విమానాలను చూశానంటూ ఓ పాక్ పౌరుడు వాట్సాప్ లో తెలిపాడు. ఈ రకంగా పలు వార్తలు చక్కర్లు కొట్టాయి. దీంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఆ తర్వాత ఎలాంటి దాడులు చోటుచేసుకోకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.