సినిమా హీరోలకు వాళ్ల స్వార్థమే ముఖ్యం: సాధినేని యామిని సంచలన వ్యాఖ్యలు!
- స్వార్థం కోసమే జగన్ ను కలిశారు
- అమరావతి ఆందోళనలపై చిరంజీవి స్పందించారా?
- టీవీ చానెల్ కార్యక్రమంలో యామిని
ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తరువాత ఎన్నో సమస్యలు వచ్చినా, ఇండస్ట్రీ పెద్దలెవరూ స్పందించలేదని వ్యాఖ్యానించిన ఆమె, విశాఖపట్నంలో గ్యాస్ లీక్ అయి, 13 మంది మరణించినా, ఒక్క హీరో కూడా స్పందించలేదని ఘాటు విమర్శలు చేశారు. వారిని సమాజమే సెలబ్రిటీలను చేసిందని, అలాంటి సమాజం ఆశలు, ఆకాంక్షలపై వారెవరు స్పందించడం లేదని, ఇది చాలా దారుణమని అన్నారు. రాజధానిగా అమరావతి ఉండాలని రైతులు చేస్తున్న ఆందోళనలపై చిరంజీవి ఒక్కనాడు కూడా స్పందించలేదని నిప్పులు చెరిగారు. ఆ వీడియోను మీరూ చూడవచ్చు.