బురుండీ దేశాధ్యక్షుడి హఠాన్మరణం... కరోనా వల్లేనని అనుమానం!
- శనివారం నాడు అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిక
- కోలుకోగానే గుండెపోటు
- కాపాడేందుకు డాక్టర్లు విఫలయత్నం చేశారన్న అధికారులు
ఇదిలావుండగా, ఆయన కరోనాతో మరణించారని పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవలే కురుంజియా భార్య డెనిస్ కు కరోనా సోకింది. ఆమె ప్రస్తుతం కెన్యాలో ఉన్న అగాఖాన్ యూనివర్శిటీ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో కురుంజిజా కూడా కరోనాతోనే మరణించి ఉండవచ్చని సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సివుంది.