హమ్మయ్య... క్రికెట్ మళ్లీ మొదలవుతోంది... ఇంగ్లాండ్ లో అడుగుపెట్టిన వెస్టిండీస్ జట్టు
- మూడ్నెల్లుగా క్రికెట్ లేక ఉసూరుమంటున్న అభిమానులు
- జూలై 8 నుంచి ఇంగ్లాండ్, విండీస్ మధ్య టెస్ట్ సిరీస్
- విండీస్ ఆటగాళ్లకు 14 రోజుల క్వారంటైన్!
కాగా, ఇంగ్లాండ్, వెస్టిండీస్ జట్ల మధ్య జరిగే మూడు టెస్టులకు ఓవల్, ఎడ్జ్ బాస్టన్, లార్డ్స్ మైదానాలు వేదికగా నిలుస్తున్నాయి. కరోనా విజృంభణ నేపథ్యంలో స్టేడియాల్లో ప్రేక్షకుల్లేకుండానే మ్యాచ్ లు నిర్వహించనున్నారు. ఈ సిరీస్ ద్వారా కొన్ని విప్లవాత్మకమైన మార్పులు క్రికెట్ లో ప్రవేశించనున్నాయి. బంతికి ఉమ్మిపూయడం, వికెట్లు పడినప్పుడు చేతులు కలపడం (హై-ఫై) వంటి చర్యలకు ఇకపై చోటు ఉండకపోవచ్చు.