ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిలో 50 మందికి కరోనా!
- ఎంఫాన్ తుపాను అనంతర సహాయ కార్యక్రమాల్లో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది
- ఎన్డీఆర్ఎఫ్లో పెరుగుతున్న కేసులతో ఆందోళన
- మొత్తం అందరికీ పరీక్షలు చేయాలని నిర్ణయం
దీంతో చికిత్స కోసం వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. మిగిలిన వారిని కటక్ సమీపంలోని ముందాలీ ఎన్డీఆర్ఎఫ్ క్యాంపస్ భవనంలో సెల్ఫ్ క్వారంటైన్ చేశారు. దేశంలో మరో 24 ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా కరోనా బారినపడినట్టు అధికారులు తెలిపారు. ఎన్డీఆర్ఎఫ్లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండడంతో మొత్తం సిబ్బంది అందరికీ పరీక్షలు నిర్వహించాలని ఎన్డీఆర్ఎఫ్ నిర్ణయించింది.