YSRCP: హోం క్వారంటైన్ లో వైసీపీ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు

  • కరోనాతో విలవిల్లాడుతున్న కోనసీమ
  • ఒక వైసీపీ నేత కారణంగా 16 మందికి కరోనా
  • నాలుగు గ్రామాలను కంటైన్మెంట్ చేసిన అధికారులు
YSRCP MLA Kondeti Chittibabu went to home quarantine

కనువిందు చేసే పచ్చదనంతో కళకళలాడే కోనసీమ ఇప్పుడు కరోనా కాటుకు విలవిల్లాడుతోంది. కోనసీమలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. తాజాగా వైసీపీ శిబిరంలో కరోనా కలకలం రేపుతోంది. అయినవిల్లి మండలం నేదునూరు పెదపాలేనికి చెందిన ఓ వైసీపీ నేత కారణంగా ఇప్పటి వరకు 16 మందికి కరోనా సోకింది. దీంతో, నాలుగు గ్రామాలను అధికారులు కంటైన్మెంట్ చేశారు. ఈ నేపథ్యంలో ఆయనను కలిసిన వారు, ఆయన కలిసిన వారు హోం క్వారంటైన్ లో ఉండాల్సిన పరిస్థితి తలెత్తింది.

ఈ నేపథ్యంలో, పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు కూడా కరోనా పరీక్షలు చేయించుకున్నారు. రిపోర్టులో నెగెటివ్ వచ్చినప్పటికీ... ఆయన హోం క్వారంటైన్ లోకి వెళ్లిపోయారు. తాను స్వీయ గృహ నిర్బంధంలో ఉన్నానని... తనను ఎవరూ కలిసేందుకు రావద్దని ఆయన విన్నవించారు.

More Telugu News