ఇంతకీ మహేశ్ సినిమాలో నాయిక ఎవరో!
- హీరోయిన్ల ఎంపికకు పెద్ద కసరత్తు చేయాలి
- మహేశ్ 'సర్కారు వారి పాట'కు ప్రచారంలో పలు పేర్లు
- తాజాగా సయీ మంజ్రేకర్ తో సంప్రదింపులు
ఇక విషయానికి వస్తే, మహేశ్ బాబు తన తాజా చిత్రాన్ని పరశురాం దర్శకత్వంలో చేస్తున్న విషయం విదితమే. 'సర్కారు వారి పాట' పేరిట రూపొందే ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. ఇక వచ్చే నెలలో సెట్స్ కి వెళ్లడానికి కూడా రెడీ అవుతున్నారు. అయితే, ఇంతవరకు కథానాయిక ఎంపిక మాత్రం పూర్తికాలేదు.
'ఈ చిత్రంలో ఫలానా హీరోయిన్' అంటూ ఇంతవరకు చాలా మంది పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. నిన్నటివరకు ఇందులో బాలీవుడ్ నటి కైరా అద్వానీ నటిస్తుందంటూ వార్తలొచ్చాయి. అయితే, తాజాగా బాలీవుడ్ కి చెందిన మరో అమ్మాయి సయీ మంజ్రేకర్ పేరు వినిపిస్తోంది. తనైతే ఫ్రెష్ నెస్ కూడా ఉంటుందని భావిస్తూ, ప్రస్తుతం ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నారట. ఏమైనా, కథానాయిక ఎవరన్నది త్వరలో తెలిసిపోతుంది.