AS Manohar: టీడీపీకి రాజీనామా చేసిన చిత్తూరు నేత ఏఎస్ మనోహర్!

  • చిత్తూరు టీడీపీ ఇన్ చార్జ్ ఏఎస్ మనోహర్
  • వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా
  • ఏ పార్టీలో చేరుతానో భవిష్యత్తే నిర్ణయిస్తుంది
Chittore TDP Leader Manohar Resigns

చిత్తూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ చార్జ్, మాజీ ఎమ్మెల్యే ఏఎస్ మనోహర్ పార్టీ సభ్యత్వానికి, తన పదవికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన, తన వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నానని వెల్లడించారు. తన నియోజకవర్గంలో పార్టీకి, కార్యకర్తలకు న్యాయం చేయలేకపోతున్నానని ఆయన వ్యాఖ్యానించారు. ఇంతకాలమూ తన కోసం పనిచేసిన పార్టీ నేతలకు కృతజ్ఞతలని అన్నారు.

 తన రాజీనామా వెనుక రాజకీయ ప్రమేయాలు లేవని, భవిష్యత్తులో ఏ పార్టీలో చేరుతానన్న విషయాన్ని కాలమే నిర్ణయిస్తుందని చెప్పారు. ప్రస్తుతానికి తాను టీడీపీకి దూరమైనట్టేనని, ఇప్పటికిప్పుడు మరో పార్టీలో చేరే ఆలోచన లేదని, తన అనుచరులను, మద్దతుదారులను టీడీపీకి దూరం చేయాలన్న ఆలోచన కూడా లేదని ఆయన అన్నారు.

More Telugu News