assam: కొండచరియలు విరిగిపడడంతో 20 మంది మృతి

  • అసోంలోని బరాక్ లోయ ప్రాంతాల్లో ఘటన
  • మరికొందరికి గాయాలు
  • ఇటీవల ఆ ప్రాంతంలో భారీ వర్షాలు
people killed in landslide in south Assam

అసోంలోని బరాక్ లోయ ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడి దాదాపు 20 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదాల్లో మరికొందరికి తీవ్రగాయాలయ్యాయి. ఇటీవల ఆ ప్రాంతంలో భారీ వర్షాలు కురిశాయి. ఈ నేపథ్యంలోనే కొండచరియలు విరిగిపడినట్లు తెలుస్తోంది. మృతుల్లో పలు జిల్లాలకు చెందిన కూలీలు ఉన్నట్లు సమాచారం.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న సహాయక బృందాలు, పోలీసులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. మృతుల్లో ఏడుగురు కచార్‌ జిల్లాకు చెందిన వారు, ఏడుగురు హైలకాండి, ఆరుగురు కరీంగంజ్ జిల్లాలకు చెందిన వారు ఉన్నారని అధికారులు చెప్పారు.

  • Loading...

More Telugu News