తెలంగాణలో బీజేపీ సీనియర్ నేతకు కరోనా... అపోలో ఆసుపత్రిలో చికిత్స!
- కరోనా అనుమానిత లక్షణాలతో ఆసుపత్రిలో చేరిన మాజీ ఎమ్మెల్యే
- తెమడ పరీక్షలో పాజిటివ్ గా నిర్ధారణ
- కరోనా భయంతో ఆసుపత్రిలో చేరిన భార్య, కొడుకు
ఆసుపత్రి వర్గాల కథనం ప్రకారం.... కరోనా అనుమానిత లక్షణాలతో ఆ మాజీ ఎమ్మెల్యేని ఆదివారం ఆసుపత్రికి తీసుకువచ్చారు. ఆయన తెమడ నమూనాలను ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఓ ఆసుపత్రికి పంపగా, కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఆ మాజీ శాసనసభ్యుడికి పాజిటివ్ అని తేలడంతో ఆయన భార్య, కొడుకు కూడా ఆసుపత్రిలో చేరారు. వారి నుంచి సేకరించిన నమూనాలను పరీక్షకు పంపారు.