ఇదే భారతీయుల్లో సోదరభావం, ఐక్యత... నిదర్శనంగా నిలిచిన వైరల్ వీడియో!
- మిజోరంకు బయలుదేరిన శ్రామిక్ రైలు
- మార్గమధ్యలో బిగూసరాయ్ వద్ద ఆగిన రైలు
- కార్మికులకు ఆహారాన్ని అందించిన బీహారీలు
అర నిమిషం నిడివి వున్న వీడియోను చూసిన వారంతా, ఇది భారతీయుల ఐక్యతను చాటిందని ప్రశంసిస్తున్నారు. ఇండియన్స్ లోని సోదరభావం, ఐక్యతకు ఈ వీడియో నిదర్శనమని, భారత్ అంటే ఇదేనని, ఇంత మంచి వీడియోను చూపినందుకు ధన్యవాదాలని నెటిజన్లు వ్యాఖ్యానించారు. మరికొందరు ఈ వీడియోను చూసి ఆనందబాష్పాలు వచ్చాయని చెప్పుకొచ్చారు. వైరల్ అయిన వీడియోను మీరూ చూడవచ్చు.