ప్రభుత్వ విధానం న్యాయం కోసం తపించినట్టుగా లేదు, న్యాయవ్యవస్థల మీద కక్షతో పోరాడినట్టుంది: వర్ల రామయ్య
- న్యాయ వ్యవస్థపై ప్రభుత్వ వైఖరి సరికాదన్న వర్ల
- రాజ్యాంగ సంక్షోభానికి దారితీస్తుందని హెచ్చరిక
- రాజ్యాంగ గౌరవం కాపాడండి అంటూ హితవు
ఈ నేపథ్యంలో, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వర్ల రామయ్య ట్విట్టర్ లో స్పందించారు. సీఎం గారూ, న్యాయవ్యవస్థల తీర్పులపై ప్రభుత్వ సంఘర్షణ వైఖరి రాజ్యాంగ సంక్షోభానికి దారితీసేలా ఉంది అంటూ వ్యాఖ్యానించారు. ప్రభుత్వ విధానం న్యాయంకోసం తపించినట్టుగా లేదని, న్యాయ వ్యవస్థలపై కక్షతో పోరాడినట్టుగా ఉందని విమర్శించారు. రాజ్యాంగ గౌరవం కాపాడుతూ, ప్రజాస్వామ్యాన్ని రక్షించండి అంటూ హితవు పలికారు.