‘అమ్మ’ స్మారకం.. అదిరిపోయేలా.. జయ సమాధిని డిజైన్ చేస్తున్న చెన్నై ఐఐటీ
- రూ. 5.08 కోట్ల అంచనాతో పనులు ప్రారంభం
- స్వయంగా పర్యవేక్షిస్తున్న ముఖ్యమంత్రి పళనిస్వామి
- జులై నెలాఖరులోగా పూర్తిచేయాలని ఆదేశం
జయలలిత సమాధిని చెన్నై ఐఐటీ డిజైన్ చేసింది. మండపం మధ్య ప్రదేశాన్ని కాంక్రీట్తో ఫినిక్స్ పక్షి ఆకారంలో తీర్చి దిద్దుతున్నారు. నిర్మాణానికి అవసరమైన వస్తువులను దుబాయ్ నుంచి దిగుమతి చేసుకున్నారు. నిర్మాణ పనులు సాగుతున్న తీరుపై ముఖ్యమంత్రి పళనిస్వామి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్న అధికారులను రెండు రోజుల క్రితం సీఎం పిలిపించుకుని పనులపై ఆరా తీశారు. ఎటువంటి హడావుడి లేకుండా పనులు పూర్తిచేయాలని, నాణ్యత విషయంలో రాజీ పడొద్దని సూచించారు. జులై చివరి నాటికి పనులు పూర్తిచేసి సిద్ధం చేయాలని ఆదేశించారు.