Pawan Kalyan: మోదీకి శుభాకాంక్షలు తెలిపిన పవన్ కల్యాణ్

Pawan Kalyan greets Modi
  • ఏడాది పాలనలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు
  • త్వరలోనే భారత్ స్వావలంబన సాధిస్తుంది
  • ఈ ఏడాది ఎన్నో చారిత్రాత్మక నిర్ణయాలను మన దేశం చూసింది
ప్రధానిగా రెండో సారి బాధ్యతలను చేపట్టిన మోదీ... ఏడాది పాలన పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మోదీకి గ్రీటింగ్స్ చెపుతూ జనసేనాని పవన్ కల్యాణ్ కూడా ట్వీట్ చేశారు.

'ఏడాది పాలనలో సాహసోపేతంగా ఎన్నో సంస్కరణలను తీసుకొచ్చిన ప్రభుత్వంలో ఉన్నవారందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ ఏడాది మన దేశం చరిత్రాత్మక నిర్ణయాలను చూసింది. త్వరలోనే స్వావలంబన కలిగిన దేశంగా భారత్ అవతరిస్తుంది. మోదీ అద్భుతమైన నాయకత్వంలో 21వ శతాబ్దం భారత్ దే అవుతుంది' అని ట్వీట్ చేశారు.
Pawan Kalyan
Janasena
Nirav Modi
bjp

More Telugu News