ఏసీలో మంటలు.. బీజేడీ నేత అలేఖ్ చౌదరి సహా ముగ్గురి మృతి
- షార్ట్ సర్క్యూట్ కారణంగా ఎగసిపడిన మంటలు
- అప్రమత్తమై కుటుంబ సభ్యులను బయటకు పంపిన అలేఖ్ చౌదరి
- బావమరిదిని రక్షించేందుకు వెళ్లి ప్రాణాలు కోల్పోయిన వైనం
అలా వెళ్లిన ఆయన ఊపిరి ఆడక గదిలోనే స్పృహ తప్పి పడిపోయారు. చౌదరి ఎంతకీ బయటకు రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వారొచ్చి మంటలను అదుపు చేసి గదిలో అపస్మారక స్థితిలో పడి ఉన్న వారిని ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే వారు ముగ్గురు మరణించినట్టు వైద్యులు నిర్ధారించారు. ఆయన మృతికి అధికార పార్టీ ఎమ్మెల్యేలు సంతాపం తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.