nagababu: నిమ్మగడ్డ వ్యవహారంలో హైకోర్టు తీర్పుపై నాగబాబు వ్యాఖ్యలు

  • భారత న్యాయ వ్యవస్థకు హ్యాట్సాఫ్
  • న్యాయవ్యవస్థ ప్రజల్లో విశ్వాసం నింపింది
  • అన్యాయంపై పోరాడే బలాన్ని ఇచ్చింది
naga babu on high court verdict

ఏపీ‌ ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ను తిరిగి నియమించాలని ఈ రోజు హైకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిపై ప్రతిపక్ష పార్టీల నేతలు స్పందిస్తూ హైకోర్టు ప్రజల్లో నమ్మకాన్ని నింపిందని అంటున్నారు. వైసీపీ సర్కారు ఇకనైనా తన తీరును మార్చుకోవాలని సూచిస్తున్నారు. హైకోర్టు తీర్పుపై జనసేన నేత, సినీనటుడు నాగబాబు స్పందిస్తూ.. 'భారత న్యాయ వ్యవస్థకు హ్యాట్సాఫ్.. న్యాయవ్యవస్థ ప్రజల్లో విశ్వాసం నింపింది. అన్యాయంపై పోరాడే బలాన్ని ఇచ్చింది' అని ట్వీట్ చేశారు.

More Telugu News