IMD: నైరుతి రుతుపవనాల రాకపై చల్లని కబురు చెప్పిన ఐఎండీ

IMD says southwest monsoons will be entered in country
  • జూన్ 1న రుతుపవనాల రాక
  • దేశంలో అత్యధిక వర్షపాతం ఇస్తున్న నైరుతి
  • ప్రస్తుతం బంగాళాఖాతంలో విస్తరించినట్టు ఐఎండీ వెల్లడి
భారత్ లో అత్యధిక శాతం వర్షపాతం నమోదయ్యేది నైరుతి రుతుపవనాల కారణంగానే! వ్యవసాయ రంగానికి ఊతమిచ్చే ఈ రుతుపవనాల కోసం రైతన్నలు ఎంతగానో ఎదురుచూస్తుంటారు. తాజాగా, నైరుతి రుతుపవనాల రాకపై భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ఆసక్తికరమైన సమాచారం వెల్లడించింది.

 జూన్ 1 నాటికి రుతుపవనాలు కేరళ వద్ద భారత్ ప్రధాన భూభాగంలో ప్రవేశిస్తాయని వివరించింది. ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు గురువారం నాటికి దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ సముద్రంలోని అత్యధిక ప్రాంతాల్లో విస్తరించాయి. మరో 48 గంటల్లో మాల్దీవులు-కొమరిన్ ప్రాంతంలోనూ రుతుపవనాలు ముందంజ వేస్తాయని ఐఎండీ పేర్కొంది. కాగా, అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడిందని, ఇది మరింత బలపడి గల్ఫ్ తీరం దిశగా పయనిస్తుందని వెల్లడించింది.
IMD
Southwest Monsoon
Rains
Bay Of Bengal
Andaman Sea
Arabian Sea

More Telugu News