Sensex: ఈ రోజూ దూకుడే.. మరోసారి 32 వేల మార్కును అధిగమించిన సెన్సెక్స్!

Sensex crosses 32k mark
షార్ట్స్‌లో చూడండి
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు కూడా మంచి లాభాలను మూటగట్టుకున్నాయి. లాక్ డౌన్ నిబంధనలను క్రమంగా సడలిస్తున్న నేపథ్యంలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడింది. ఈ క్రమంలో సూచీలు లాభాల్లో పయనించాయి. సెన్సెక్స్ మరోసారి 32 వేల మార్కును అధిగమించింది. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 595 పాయింట్లు లాభపడి 32,201కి ఎగబాకింది. నిఫ్టీ 175 పాయింట్లు పెరిగి 9,490కి చేరుకుంది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఎల్ అండ్ టీ (6.17), హీరో మోటో కార్ప్ (5.52), ఇండస్ ఇండ్ బ్యాంక్ (4.95), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (4.56), మారుతి సుజుకి (4.37).

టాప్ లూజర్స్:
ఐటీసీ (0.83), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (0.19), భారతి ఎయిర్ టెల్ (0.05).
Go Back to Shorts
Sensex
Nifty
Stock Market

More Telugu News