భోపాల్ నుంచి నలుగురు కుటుంబ సభ్యులను తరలించేందుకు ఎయిర్ బస్ ను బుక్ చేసిన సంపన్నుడు!
- ఢిల్లీ నుంచి ఖాళీగా భోపాల్ వచ్చిన విమానం
- భోపాల్ నుంచి ఓ మహిళ, ఇద్దరు పిల్లలు, వృద్ధురాలితో ఢిల్లీ పయనం
- రూ.10 లక్షలు చెల్లించిన వ్యాపారవేత్త
భారత్ లో కరోనా వ్యాప్తి అధికంగా ఉండడంతో అనేకమంది సంపన్నులు అధిక రద్దీ ఉండే సాధారణ విమానాల్లో ప్రయాణించేందుకు మొగ్గు చూపడంలేదని, విమానం మొత్తం రిజర్వ్ చేసుకుంటున్నారని ఎయిర్ లైన్స్ వర్గాలంటున్నాయి. ప్రస్తుతం విమానాల ఇంధనం బాగా తగ్గడంతో విమానయాన సంస్థలు కూడా అద్దెలు తగ్గించాయని ఓ అధికారి వివరించారు.