ప్రజలంటే వైసీపీ నాయకులకు గౌరవం లేదు: కన్నా లక్ష్మీనారాయణ
- ప్రజలపై జగన్ అధిక ఛార్జీల భారం వేస్తున్నారు
- భూములు అమ్మకానికి పెట్టే పరిస్థితి వచ్చింది
- నిన్న హైకోర్టు కూడా ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది
అనేక విషయాలపై కోర్టుల్లో వైసీపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బలు తగులుతున్నాయని ఆయన దెప్పిపొడిచారు. ప్రజలంటే వైసీపీ నాయకులకు గౌరవంలేదని, ప్రతిపక్షాలంటే అస్సలే లేదని ఆయన అన్నారు. ఆ పార్టీ నేతలు చట్టాలు, చట్టసభలపై కూడా గౌరవం లేకుండా ప్రవర్తిస్తున్నారని ఆయన చెప్పారు. ఎన్నికల కమిషన్ కూడా వైసీపీ సొంత కార్యకర్తలా ఉండాలన్న ఉద్దేశంతో ఆ పార్టీ ఉందని విమర్శించారు. అందుకే రమేశ్ కుమార్ను పదవి నుంచి తొలగించారని చెప్పారు.