టెక్నాలజీపై నా నమ్మకం మరింత పెరిగింది: చంద్రబాబు
- ఎలాంటి సమస్యలకైనా పరిష్కార మార్గం
- లాక్ డౌన్ తో ఈ సంవత్సరం డిజిటల్ మహానాడు
- కార్యకర్తలు పాల్గొనాలన్న చంద్రబాబునాయుడు
ప్రతి సంవత్సరమూ అసంఖ్యాకంగా వచ్చే నేతలు, కార్యకర్తల మధ్య సాగే మహానాడుకు ఈ సంవత్సరం నిబంధనలు అడ్డుగా నిలిచాయని అన్నారు. జూమ్ తమకు కొత్త మార్గాన్ని చూపిందన్నారు. ఇండియాలోనే తొలిసారిగా ఓ రాజకీయ సమావేశం డిజిటల్ మాధ్యమంగా సాగుతోందని వ్యాఖ్యానించిన ఆయన, టీడీపీకి చెందిన వారంతా తమ స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్ లలో జూమ్ యాప్ ను ఇన్ స్టాల్ చేసుకుని ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.