ఆలయాలు తెరుస్తున్న తొలి రాష్ట్రంగా కర్ణాటక
- జూన్ 1 నుంచి ఆలయాల్లో దర్శనాలు
- వేడుకలు, జాతరలపై నిషేధం
- జూలై 1 నుంచి స్కూళ్లు!
అయితే, కర్ణాటక అన్ని రాష్ట్రాల కంటే ముందు ఆలయాలు తెరుస్తోంది. జూన్ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆలయాలను తెరవాలని నిర్ణయించింది. త్వరలోనే దీనిపై మార్గదర్శకాలతో కూడిన ప్రకటన చేయనుంది. అయితే, ప్రజలు ఎక్కువగా వచ్చే అవకాశమున్నందున జాతరలు, ఇతర పండుగ వేడుకలపై మాత్రం నిషేధం విధించింది.
కాగా, ఇదే రీతిలో స్కూళ్లను జూలై 1 నుంచి తెరవాలని కర్ణాటక భావిస్తోంది. దీనిపై స్పష్టత లేదు. మే 31తో కేంద్రం విధించిన లాక్ డౌన్ పూర్తవుతున్న నేపథ్యంలో, కేంద్రం తదుపరి ప్రకటనను పరిగణనలోకి తీసుకుని కర్ణాటక ప్రభుత్వం స్పందించే అవకాశాలున్నాయి.