అన్నం తినడు, నీళ్లు తాగడు... ఏడు దశాబ్దాల పాటు ఇలాగే బతికిన అద్భుత బాబా కన్నుమూత
- 70 ఏళ్లుగా అన్నం, నీళ్లు ముట్టని యోగి ప్రహ్లాద్
- 90 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచిన యోగి
- శాస్త్రవేత్తలకు సైతం అంతుబట్టని యోగి!
అది గొప్పదనం అనడం కంటే సైన్స్ కు అందని మహాద్భుతం అంటే సరిపోతుంది. యోగి ప్రహ్లాద్ పై గతంలో అనేక ప్రయోగాలు కూడా జరిగాయి. అన్నపానాదులు లేకుండా ఎలా బతుకుతున్నాడంటూ ప్రఖ్యాత శాస్త్రవేత్తలు ఆయనను నిశితంగా పరిశీలించి ఏమీ తేల్చలేకపోయారు. ఏదో శారీరక అసాధారణత అని మాత్రం చెప్పగలిగారు. 2010లో యోగి ప్రహ్లాద్ ను రెండు వారాల పాటు ఓ రూమ్ లో ఉంచి వీడియో కెమెరాల ద్వారా పర్యవేక్షించారు. ఆపై అన్నిరకాల వైద్య పరీక్షలు నిర్వహించి తేల్చిందేమిటంటే... యోగి ప్రహ్లాద్ కు అసాధారణ రీతిలో ఆకలి, దాహాన్ని జయించగల శక్తి ఉందని గుర్తించారు.
అంతెందుకు, మాజీ రాష్ట్రపతి, ప్రఖ్యాత శాస్త్రవేత్త అబ్దుల్ కలాం కూడా ఈ యోగి ఎలా బతుకుతున్నాడని ఎంతో ఆసక్తి చూపించినవాళ్లలో ఒకరు. యోగి మాత్రం తాను యోగధ్యానంతోనే జీవిస్తున్నానని సెలవిచ్చారు. ఇక, ప్రస్తుత విషయానికొస్తే, గురువారం నాడు బనస్కాంత ఆశ్రమంలోనే యోగి అంత్యక్రియలు జరగనున్నాయి. అప్పటివరకు భక్తుల సందర్శనార్థం ఆశ్రమంలోనే పార్థివ దేహాన్ని ఉంచుతారు.