డాక్టర్ సుధాకర్ కేసులో సుప్రీం మెట్లెక్కనున్న ఏపీ సర్కార్
- డాక్టర్ సుధాకర్ కేసును సీబీఐకి అప్పగించిన హైకోర్టు
- ఎనిమిది వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశం
- డాక్టర్ శరీరంపై గాయాలున్నాయని మేజిస్ట్రేట్ విచారణలో తేలిన వైనం
ప్రభుత్వం ఇచ్చిన నివేదికలో సుధాకర్ ఒంటిపై గాయాలు లేవని ఉందని... తాజాగా మేజిస్ట్రేట్ ఇచ్చిన నివేదికలో సుధాకర్ శరీరంపై గాయలున్నాయని ఉందని... అందుకే దీని వెనుక కుట్ర ఉన్నట్టు హైకోర్టు భావించింది. అనుమానాలు ఉన్నందువల్లే సీబీఐ విచారణకు ఆదేశిస్తున్నామని తెలిపింది. ఈ నేపథ్యంలోనే హైకోర్టు తీర్పును సుప్రీంలో రాష్ట్ర ప్రభుత్వం సవాల్ చేయనుంది.