హైదరాబాద్ ఎల్బీనగర్ లో వైద్య విద్యార్థిని అనుమానాస్పద మృతి
- ఉస్మానియా డెంటల్ కాలేజీలో చదువుతున్న సాహితి
- 14వ అంతస్తు నుంచి దూకిందంటున్న కుటుంబ సభ్యులు
- అనుమానాస్పద మృతి కేసుగా నమోదు
ఆమె తల్లిదండ్రులు రఘురాం, పద్మ. కాగా, సాహితి ఈ మధ్యాహ్నం తమ నివాసంలోని బాల్కనీ గ్రిల్స్ తొలగించి కిందికి దూకినట్టు చెబుతున్నారు. ఎంబీబీఎస్ లో సీటు రాకపోవడంపై సాహితి మనస్తాపానికి గురైందని అంటున్నారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.