Madhya Pradesh: పొలాలపై పడుతున్న మిడతల దండు.. తరిమికొడుతున్న రైతుల సౌండు!

 Madhya Pradesh Farmers in Budhni and Nasrullaganj of Sehore district beat
షార్ట్స్‌లో చూడండి
ఇటీవల రాజస్థాన్‌లో పంటలను నాశనం చేసిన మిడతలు ఇప్పుడు మధ్యప్రదేశ్‌లో ప్రవేశించాయి. దీంతో పలు ప్రాంతాల రైతులను ఆ రాష్ట్ర వ్యవసాయ శాఖ అధికారులు అప్రమత్తం చేశారు. అధికారుల సూచనల మేరకు మిడతలను తరిమికొట్టేందుకు రైతులు పలు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. మిడతల దాడి మొదలైన బుధ్నిలోని పొలాల్లో పెద్దగా శబ్దాలు చేస్తూ పొలాల వద్ద పలు చర్యలు తీసుకుంటున్నారు.

అంతేగాక, అవి ఏ దిశగా వెళుతున్నాయన్న విషయాన్ని కూడా గుర్తించి అధికారులకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నారు. అలాగే, మిడతల తాకిడి ఉన్న పొలాల పరిసరాల్లో రసాయనాలను పిచికారి చేస్తున్నారు. ఈ మిడతలను నియంత్రించలేకపోతే కోట్లాది రూపాయల విలువైన పెసర పంటకు నష్టం వాటిల్లే అవకాశం ఉంది.
Go Back to Shorts
Madhya Pradesh
Viral Videos

More Telugu News