ఇది ముమ్మాటికీ దాతల మనోభావాలు దెబ్బతీయడమే: టీటీడీ ఆస్తుల విక్రయంపై వైసీపీ ఎంపీ వ్యాఖ్యలు
- టీటీడీ నిర్ణయం పట్ల రఘురామ కృష్ణంరాజు అభ్యంతరం
- భక్తితో ఇచ్చిన ఆస్తులను పరిరక్షించాలని హితవు
- సీఎం దృష్టికి తీసుకెళ్లినట్టు వెల్లడి
దేవుడి పేరిట ఉన్న ఆస్తులను అమ్మడం ద్వారా ఆ దేవుడికి టీటీడీ ద్రోహం చేస్తోందని అన్నారు. టీటీడీ తన నిర్ణయం ద్వారా.... భూములు విరాళంగా ఇచ్చిన దాతల మనోభావాలను దెబ్బతీస్తోందని ఆరోపించారు. దాతలు ఎంతో భక్తితో ఆస్తులు సమర్పిస్తారని, ఆ ఆస్తులను పరిరక్షించాలే కానీ, విక్రయించడం సబబు కాదని రఘురామ కృష్ణంరాజు హితవు పలికారు. ఈ అంశాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లినట్టు వెల్లడించారు.