Manchu Manoj: ఆస్తులు అమ్మమని దేవుడు చెప్పాడా?: టీటీడీ వ్యవహారంపై మంచు మనోజ్ వ్యాఖ్యలు

Manchu Manoj asks TTD why they wants to sell assets
షార్ట్స్‌లో చూడండి
శ్రీవారి ఆస్తుల విక్రయం అంశం ఏపీలో తీవ్ర దుమారం రేపుతోంది. తాజాగా దీనిపై సినీ నటుడు మంచు మనోజ్ స్పందించారు. ఆస్తులు అమ్మమని దేవుడేమన్నా చెప్పాడా అంటూ టీటీడీని సూటిగా ప్రశ్నించారు. శ్రీవారికి సంబంధించిన ప్రతి విషయం చెప్పేది, చేసేది టీటీడీయేనని స్పష్టం చేశారు.

"సుప్రభాత సేవకు వేళయింది అని ఆ శ్రీహరిని, కొండకు వచ్చిన లక్షలమంది భక్తులను అందరినీ కంట్రోల్ చేసేది టీటీడీనే. అలాంటిది, వడ్డీకాసులవాడి ఆస్తులు అమ్మకానికి వచ్చాయంటే గోవింద నామస్మరణ చేసే నా గొంతు తడబడింది. అయితే, మోసం జరగట్లేదని తెలుసు. ఇన్ సైడర్ ట్రేడింగ్ లా కాకుండా అందరు చూస్తుండగా వేలం వేసి అమ్ముతారు. కానీ ఎందుకు అమ్మాల్సి వచ్చింది అనే అంశంపై పాలకమండలి వివరణ ఇస్తే బాగుంటుంది. వివరణ తప్ప మరేమీ కోరడంలేదు, ఎందుకంటే, ఇంత పెద్ద కొండ మాకు అండగా ఉందని చూస్తూ మురిసిపోయే తిరుపతి వాడ్ని కాబట్టి ఆపుకోలేక అడుగుతున్నాను" అంటూ ట్వీట్ చేశారు.
Go Back to Shorts
Manchu Manoj
TTD
Assets
Auction
Tirumala
Tirupati
Andhra Pradesh

More Telugu News