ఆస్తుల అమ్మకంపై వైవీ సుబ్బారెడ్డికి లేఖ రాసిన టీటీడీ బోర్డు ప్రత్యేక ఆహ్వానితుడు రాకేశ్ సిన్హా
- విమర్శల పాలవుతున్న శ్రీవారి ఆస్తుల అమ్మకం
- తమిళనాడులో ఉన్న 23 ఆస్తుల వేలానికి టీటీడీ నిర్ణయం
- ఆస్తుల అమ్మకం నిలిపివేయాలన్న సిన్హా
స్వామివారికి భక్తులు విరాళంగా ఇచ్చిన ఆస్తులను విక్రయించడం అంటే భక్తుల మనోభావాలకు వ్యతిరేకంగా వ్యవహరించడమేనని, ఈ నిర్ణయంపై పునరాలోచన చేస్తే బాగుంటుందని సూచించారు. తమిళనాడులో ఉన్న 23 ఆస్తులను బహిరంగ వేలం ద్వారా విక్రయించి సుమారు రూ.100 కోట్ల ఆదాయం సమకూర్చుకోవాలని టీటీడీ భావించింది. అయితే ఈ నిర్ణయాన్ని టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నాయి.