Hyundai: ఇటీవలే ఉత్పత్తి ప్రారంభించిన హ్యుందాయ్, మారుతి... అంతలోనే ఉద్యోగులకు కరోనా పాజిటివ్

  • ఇటీవలే కార్యకలాపాలు షురూ చేసిన ఆటోమొబైల్ సంస్థలు
  • హ్యుందాయ్ చెన్నై ప్లాంట్ లో ముగ్గురికి కరోనా
  • మారుతిసుజుకి యూనిట్ లో ఒకరికి పాజిటివ్
Corona tested positive in Hyundai and Maruti Suzuki plants

సుదీర్ఘ లాక్ డౌన్ కారణంగా ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుందన్న ఉద్దేశంతో ఆటోమొబైల్ ఉత్పాదనకు కేంద్రం పచ్చజెండా ఊపిన సంగతి తెలిసిందే. దాంతో ఆటోమొబైల్ దిగ్గజాలు హ్యుందాయ్, మారుతి రెట్టించిన ఉత్సాహంతో తమ యూనిట్లలో కార్యకలాపాలు పునఃప్రారంభించాయి. ఎంత ఉత్సాహంతో ప్రారంభించారో, అంతే నిరాశ కలిగిస్తూ ఆయా సంస్థల తయారీ యూనిట్లలో ఉద్యోగులు కరోనా బారినపడ్డారు.

చెన్నైలోని హ్యుందాయ్ కార్ల ఉత్పత్తి కేంద్రంలో ముగ్గురికి, మనేసర్ లోని మారుతి సుజుకి కార్ల తయారీ యూనిట్ లో ఒకరికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దాంతో ఆయా యూనిట్లలో అధికారులు అప్రమత్తమయ్యారు. వారితో కలిసి పనిచేసిన వారిని గుర్తించే పనిలోపడ్డారు. వారు పనిచేసిన ప్రదేశాన్ని పూర్తిగా శానిటైజ్ చేశారు. హ్యుందాయ్ యూనిట్ లో కరోనా బారిన పడిన ఉద్యోగుల్లో స్వల్పంగానే కరోనా లక్షణాలు కనిపిస్తున్నాయని, కొద్దిమేర జలుబు, దగ్గుతో బాధపడుతున్నారని అధికారులు వివరించారు. వారితో సన్నిహితంగా మెలిగిన 16 మంది ఉద్యోగుల నుంచి నమూనాలు సేకరించి కరోనా టెస్టుకు పంపించారు. మరో రెండ్రోజుల్లో ఫలితాలు రానున్నాయి.

More Telugu News