Anushka Sharma: అనుష్క శర్మ వెబ్ సిరీస్ పై మానవహక్కుల కమిషన్ లో ఫిర్యాదు

  • 'పాతాళ్ లోక్' సిరీస్ ను నిర్మించిన అనుష్క
  • తమను కించపరిచారన్న గూర్ఖా సమాజం
  • డైలాగ్స్ మ్యూట్ చేయాలని డిమాండ్
Complaint Against Anushka Sharma Over Comments On Gorkhas In Paatal Lok

ప్రముఖ బాలీవుడ్ నటి, నిర్మాత అనుష్క శర్మ 'పాతాళ్ లోక్' అనే వెబ్ సిరీస్ ను నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ వెబ్ సిరీస్ పలువురి ప్రశంసలను పొందింది. ఇదే సమయంలో విమర్శలను కూడా మూటగట్టుకుంది. ఈ సిరీస్ పై మానవహక్కుల కమిషన్ లో ఫిర్యాదు నమోదైంది. 'ది ఆల్ అరుణాచల్ ప్రదేశ్ గూర్ఖా యూత్ అసోసియేషన్' సభ్యులు ఈ ఫిర్యాదు చేశారు.

తమ గూర్ఖా సమాజాన్ని అవమానకరంగా చిత్రీకరించారని ఫిర్యాదులో ఆరోపించారు. రెండో ఎపిసోడ్ లో తమను కించపరిచే విధంగా ఒక సన్నివేశాన్ని చిత్రీకరించారని తెలిపారు. ఆ సీన్ లో వచ్చే డైలాగ్స్ వినపడకుండా మ్యూట్ చేయాలని డిమాండ్ చేశారు. ఇదే సమయంలో అనుష్కశర్మకు గూర్ఖా సమాజానికి చెందిన కొన్ని వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. అనుష్కపై న్యాయపరమైన చర్యలు తీసుకునేలా పోరాడతామని తెలిపాయి.

More Telugu News