కశ్మీర్‌పై కీలక వ్యాఖ్యలు చేసిన తాలిబన్

taliban on kashmir
  • ఆ ప్రాంతం భారత్‌దే
  • ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోము
  • పాక్‌కి మేము మద్దతివ్వట్లేదు
కశ్మీర్‌పై ఉగ్రవాద సంస్థ తాలిబన్ కీలక వ్యాఖ్యలు చేసింది. ఆ ప్రాంతం భారత్‌దేనని, తాము ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోబోమని తెలిపింది. కశ్మీర్‌లో పాక్‌ చర్యలపై స్పందిస్తూ.. జిహాదీ పేరిట ఆ దేశం ప్రోత్సహిస్తున్న ఉగ్రవాదానికి తాము మద్దతు ఇస్తామని వస్తున్న ప్రచారాన్ని కొట్టి పారేస్తూ తాలిబన్ నేత సుహైల్ షాహీన్  ఓ ప్రకటన చేశారు.

అలాగే, కశ్మీర్ సమస్య పరిష్కారమయ్యే వరకు భారత్‌కు, తాలిబన్‌కు మధ్య సత్సంబంధాలు కొనసాగే ప్రసక్తే లేదని తాము చెప్పినట్లు వస్తోన్న ప్రచారాన్ని కూడా ఆయన కొట్టిపారేశారు. ఈ ప్రచారంలో నిజం లేదని, తాము అలాంటి ప్రకటన విడుదల చేయలేదని చెప్పారు.

ఆయా దేశాల అంతర్గత అంశాల్లో జోక్యం చేసుకోవద్దన్నది తాము ఓ విధానంగా పెట్టుకున్నామని స్పష్టం చేశారు. కాగా, కశ్మీర్‌పై ఇటీవల తాలిబన్‌ ప్రకటన చేసినట్లు వచ్చిన వార్తలను భారత్‌ ఇప్పటికే కొట్టిపారేసింది. ఇప్పుడు అదే విషయంపై తాలిబన్‌ కూడా స్పందిస్తూ దానిపై స్పష్టతనిచ్చింది.
Go Back to Shorts
Jammu And Kashmir
taliban
India

More Telugu News