అది రూ.20 లక్షల కోట్ల ప్యాకేజి కాదు, రూ.3.22 లక్షల కోట్ల ప్యాకేజి మాత్రమే: కాంగ్రెస్ విమర్శలు
- ఇటీవల భారీ ప్యాకేజి ప్రకటించిన మోదీ
- స్పందించిన కాంగ్రెస్ వర్గాలు
- జీడీపీలో దాని శాతం 1.6 మాత్రమేనని వెల్లడి
కాంగ్రెస్ పార్టీ సీనియర్ అధికార ప్రతినిధి ఆనంద్ శర్మ మాట్లాడుతూ, ప్రధాని మోదీ తన మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. చిన్న, మధ్య తరహా వ్యాపారులకు, పేదలకు నగదు సాయం చేసే దిశగా చర్యలు ప్రకటించాలని, ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవానికి అదే మార్గమని తెలిపారు. రుణాలు ఇవ్వడానికి, ఉద్దీపనలు ప్రకటించడానికి తేడా ఉందని అన్నారు. ప్రధాని ప్రకటించిన ప్యాకేజిపై చర్చకు సిద్ధమా అంటూ ఆనంద్ శర్మ కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కు సవాల్ విసిరారు.