Nirmala Sitharaman: మీడియా ముందు సోనియా గాంధీకి చేతులెత్తి నమస్కరించి వేడుకున్న నిర్మలా సీతారామన్!

  • ప్రతిపక్ష పార్టీలకు నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను 
  • వలస కార్మికుల అంశంపై అందరం కలిసి పనిచేయాలి
  • ఈ సమస్యపై మేము అన్ని రాష్ట్రాలతో కలిసి పని చేస్తున్నాం
  • సోనియా గాంధీకి చేతులెత్తి నమస్కరిస్తూ ఈ విషయం చెబుతున్నాను
nirmala sitaraman fires on sonia gandhi

లాక్‌డౌన్‌ నేపథ్యంలో వలస కార్మికుల పరిస్థితులపై రాజకీయాలు చేస్తున్నారంటూ ప్రతిపక్షాలపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మండిపడ్డారు. 'ప్రతిపక్ష పార్టీలకు నేను ఒకటి చెప్పాలనుకుంటున్నారు. వలస కార్మికుల అంశంపై అందరం కలిసి పనిచేయాలి. ఈ సమస్యపై మేము అన్ని రాష్ట్రాలతో కలిసి పని చేస్తున్నాం. సోనియా గాంధీకి చేతులెత్తి నమస్కరిస్తూ నేను ఒకటి చెబుతున్నాను. వలసకార్మికులపై మరింత బాధ్యతగా మాట్లాడాలి, వారి సమస్యలను పరిష్కరించాలి' అని వ్యాఖ్యానించారు.

ఈ సందర్భంగా మీడియా ముందు చేతులు ఎత్తి నమస్కరించారు. వలస కార్మికుల విషయంలో రాజకీయాలు చేయడం తగదని ఆమె అన్నారు. కార్మికుల సమస్యలను పరిష్కరించే విషయంలో నిజాయతీగా వ్యవహరించాల్సింది పోయి, ఈ విషయంపై రాజకీయాలు చేస్తున్నారని కాంగ్రెస్ నేత రాహుల్  గాంధీపై కూడా ఆమె విమర్శలు గుప్పించారు.  రాహుల్‌ గాంధీ ఇప్పటికైనా నాటకాలు మానుకోవాలని ఆమె సూచించారు.

More Telugu News