112 మందిని ఖననం చేస్తే నాలుగైదు పీపీఈ కిట్లు ఇచ్చారు: ఓ శ్మశానవాటిక పర్యవేక్షకుడి ఆవేదన
- పోలీసులు, వైద్య, పారిశుద్ధ్య సిబ్బందికి బీమా సౌకర్యం
- తనకూ బీమా ఇవ్వాలన్న శ్మశాన వాటిక సూపర్ వైజర్
- రోజూ కరోనాతో పోరాడుతున్నానని వెల్లడి
వందమందిని పైగా ఖననం చేస్తే నాలుగైదు పీపీఈ కిట్లు మాత్రం ఇచ్చారని, అవి సరిపోవని ఆరోగ్య శాఖను అడిగితే తమ సిబ్బందికే లేవు నీకేం ఇస్తామని అంటున్నారని షమీమ్ ఆవేదన వ్యక్తం చేశాడు. కాగా, ఆ శ్మశాన వాటిక కమిటీ మాత్రం, అంత్యక్రియల సమయంలో మృతదేహాలకు దూరంగా ఉండాలని మాత్రం షమీమ్ కు సూచించిందట. తాను ప్రతిరోజూ కరోనా వైరస్ తో పోరాడుతున్నట్టే భావించాలని, తనకు కూడా ఆరోగ్య బీమా అమలు చేయాలని ఆ సూపర్ వైజర్ కోరుతున్నారు.